వరంగల్, 28 జూన్ (హి.స.)
కన్నతల్లి పై కొడుకు పెట్రోల్ పోసి
నిప్పంటించి పరారైన దారుణ ఘటన వరంగల్ లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద (50) పై ఆస్తి తగాదాల విషయంలో పగ పెంచుకున్న కన్న కొడుకు సతీష్ పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడని తెలిపారు. గమనించిన స్థానికులు, బంధువులు వినోదను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు వినోద 85 శాతం కాలిందని ప్రస్తుతం వినోద పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. మెజిస్ట్రేట్ కు తన కన్న కొడుకే పెట్రోల్ పోసి నిప్పంటిచినట్లు వాంగ్మూలం ఇచ్చింది తల్లి వినోద.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్