అమరావతి, 28 జూన్ (హి.స.)
: ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ‘సురక్షా 360’ కార్యక్రమాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి అన్నారు. సాంకేతికత వినియోగంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ముందంజలో ఉందని ప్రశంసించారు. మోడల్ పోలీసు స్టేషన్లు జిల్లా మొత్తం విస్తరించాలని.. సురక్ష యాప్, సురక్ష డివైస్ల వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆలయం, చర్చి, మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా 28 సురక్ష డివైస్ కిట్లను అధికారులకు మంత్రి అందజేశారు. ప్రతి గ్రామం, ప్రతి వీధి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలనేది సురక్షా 360 లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ