స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పనిచేస్తేనే అగ్రస్థానం నిలబెట్టుకోగలుగుతాం: డీజీపీ జితేందర్
హైదరాబాద్, 28 జూన్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో డీజీపీ సమావ
డీజీపీ జితేందర్


హైదరాబాద్, 28 జూన్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కీలకపాత్ర వహిస్తారని, ఆ స్థాయిలో నిబద్ధతతో పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని కొనసాగించగలుగుతుందని చెప్పారు. ప్రజల క్షేమమే పరమావధిగా భావిస్తూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం పోలీస్ శాఖకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది పని చేయాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande