అమరావతి, 28 జూన్ (హి.స.)మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఘన నివాళులర్పించారు.
పీవీ 104వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ ఎక్స్లో చంద్రబాబు ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారని, అనేక ఆర్థిక సంస్కరణలు చేసి దేశ గతిని మార్చారని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి