ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు: నారా లోకేష్
అమరావతి, 28 జూన్ (హి.స.)దేశ మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు (Pamulaparthi Venkata Narasimha Rao) జయంతిని (జూన్ 28) పురస్కరించుకుని, ఆ మహోన్నత నాయకుడికి ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించా
ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు: నారా లోకేష్


అమరావతి, 28 జూన్ (హి.స.)దేశ మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు (Pamulaparthi Venkata Narasimha Rao) జయంతిని (జూన్ 28) పురస్కరించుకుని, ఆ మహోన్నత నాయకుడికి ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు.

పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ట్వీట్ చేశారు. 'తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తిగడించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకుందాం' అంటూ పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చిన తొలి ప్రధాని‌గా, 1991 ఆర్థిక మాంద్యంలోనూ దేశాన్ని పునరుద్ధరించిన శక్తివంతమైన నాయకుడిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande