తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
తిరుమల, 28 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు (Devotees) పోటెత్తడ
తిరుమల


తిరుమల, 28 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు (Devotees) పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట ఎన్‌జీ షెడ్స్ వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో సర్వదర్శనానికి 20 గంటలు పడుతోండగా, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్టు తీసుకున్న భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని భక్తులు గమనించాలని పిలుపునిచ్చారు. ఇక నిన్న అర్థరాత్రి వరకు శ్రీవారిని 68,229 మంది భక్తులు దర్శించుకోగా, 30,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు సమకూరినట్లు TTD అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande