అమరావతి, 29 జూన్ (హి.స.)
అక్రమమైనింగ్కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలిగించి న వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముం దస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పీల్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ ఆన్ రికార్డ్(ఏవోఆర్) కార్యాలయ ప్రత్యేక అధికారిని ఆదేశించింది. దీనికి సంబంధించి హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ