హైదరాబాద్, 29 జూన్ (హి.స.)
తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపకపోతే చంపేస్తామని అందులో మావోయిస్టులు పేర్కొన్నారు. తమ మనుషులంతా హైదరాబాద్లో ఉన్నారని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. కాగా ఎంపీ రఘునందన్ రావుకు జూన్ 23న కూడా బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపు కాల్స్పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించింది. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్