హైదరాబాద్, 29 జూన్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసమే బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. నిజామాబాద్లో ప్రతిష్టాత్మకంగా పసుపు బోర్డును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది రైతుల కోసం చేసే కార్యక్రమం అని అన్నారు. రేవంత్ రెడ్డి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో తాము పనిచేయబోమని సీరియస్ అయ్యారు. గతవారం మెట్రో డీపీఆర్ కేంద్రానికి ఇచ్చారు. సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుంది. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
జులై 1వ తేదీన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రేపు బన్సల్, శోభాకరం సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారని తెలిపారు. ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి మనసులో మాట బయటపెట్టారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్