రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపుగా పరిష్కారం అయింది
అమరావతి, 29 జూన్ (హి.స.) అమరావతి, రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపు పరిష్కారమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పలు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి. కిలోకు రూ.500 చొప్పున కంపెనీలు రైతులకు చెల్లిస్తే.. అందులో రూ.50 సదరు కంపెనీలకు రాష్ట్ర ప్
రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపుగా పరిష్కారం అయింది


అమరావతి, 29 జూన్ (హి.స.)

అమరావతి, రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపు పరిష్కారమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పలు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి. కిలోకు రూ.500 చొప్పున కంపెనీలు రైతులకు చెల్లిస్తే.. అందులో రూ.50 సదరు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. ఈ ఏడాది కోకో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని, కనీస మద్దతు ధరను నిర్ణయించింది. అయినా అన్ని కంపెనీలు, వ్యాపారులు కోకో గింజల కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో సీఎం చంద్రబాబు ధరలపై సమీక్ష జరిపారు. సేకరణ ధరలో కిలోకి రూ.50 ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande