అమరావతి, 29 జూన్ (హి.స.)
అంతర్వేది: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అసిస్టెంట్ కమిషనర్ ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ