మీడియా ముసుగులో స్లాటర్ హౌస్లు నడుపుతున్నారు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ, సూర్యాపేట. 29 జూన్ (హి.స.) మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసుగులో దాడి చేస్తే కేస
జగదీష్ రెడ్డి


తెలంగాణ, సూర్యాపేట. 29 జూన్ (హి.స.)

మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మీ దాడులకు తాము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరని చెప్పారు. సూర్యాపేటలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా ముసుగులో ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని కాంగ్రెస్ పైమండిపడ్డారు. ఏడాదిన్నరగా మీడియాని అడ్డం పెట్టుకుని కేసీఆర్పై కుట్రలు చేస్తూన్నరని చెప్పారు. తమను ఇబ్బందిపెట్టే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చంద్రబాబు, రేవంత్ను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవ్వరూ కాపాడలేరని స్పష్టం చేశారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్పై దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande