తెలంగాణ, నిజామాబాద్. 29 జూన్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు లాంచనంగా ప్రారంభించారు.. నేటి మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన అక్కడ నుంచి హెలికాప్టర్ లో ఇందూరుకి వచ్చారు. అనంతరం పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే పసుపు బోర్డు కార్యా లయంలో ఏర్పా టు చేసిన పసు పు ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సభలో అమిత్ షా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ ,ఎంపీ ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు