హైదరాబాద్, 29 జూన్ (హి.స.)
జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్రావే కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో న్యాయవాదితో కలిసివచ్చి పోలీసుల ఎదుట పూర్ణచందర్ లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. ఇదిలా ఉండగా స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచంద్రను పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..