తెలంగాణ, నల్గొండ. 29 జూన్ (హి.స.) అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో రాజకీయాలకు తావులేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు రాని అర్హులైన నిరుపేదలకు రెండో జాబితాలో ఇల్లు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.
కరెంట్ లూజు లైన్స్, గృహాల మీదుగా వెళ్తున్న 11 కేవీ కరెంట్ లైన్లను వెంటనే తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసే వాళ్లే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలన్నారు. ప్రజలు కూడా అటువంటి వారినే గెలిపించుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు