తెలంగాణ,మహబూబ్ నగర్ :29 జూన్ (హి.స.)
ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవాభావంతో నాణ్యమైన వైద్య సేవలందించాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శెట్టి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు. పట్టణంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని, ఇక పట్టణ ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని, ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు