పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ, జగిత్యాల. 29 జూన్ (హి.స.) పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం గొల్లపల్లి మండల కేంద్రంలో లబ్దిదారులకు మంజూరు అయిన సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చె
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


తెలంగాణ, జగిత్యాల. 29 జూన్ (హి.స.)

పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ

ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం గొల్లపల్లి మండల కేంద్రంలో లబ్దిదారులకు మంజూరు అయిన సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నదన్నారు.

మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు రానివారు అధైర్య పడొద్దని వారికి రెండో విడతలో ఇస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ పథకాలు అందజేస్తామని, వివిధ సమస్యలతో అధికారుల దగ్గరికి వచ్చే ప్రజలకు అధికారులు జవాబుదారిగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande