విద్య, వైద్యం, వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత : ఎమ్మెల్యే పట్లోళ్ల
తెలంగాణ, సంగారెడ్డి. 29 జూన్ (హి.స.)నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ మే
ఎమ్మెల్యే పటోళ్ల


తెలంగాణ, సంగారెడ్డి. 29 జూన్ (హి.స.)నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ మాట్లాడుతూ నారాయణఖేడ్ లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం వ్యవసాయం పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం పట్ల మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని దానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ వస్తారని కాబట్టి ఆసుపత్రి వైద్యులు వారికి సరైన వైద్యం అందించాలని వారు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande