భద్రాచలం ఆదివాసి మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 29 జూన్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసి మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. నేటి మనకి బాత్ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం ఆదివాసి మహిళలు ''భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్'' పేరిట బిస్క
పీఎం మోడీ


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 29 జూన్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసి మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. నేటి మనకి బాత్ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం ఆదివాసి మహిళలు 'భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్' పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని, ఆ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మహిళలే మూడు నెలల్లో 40 వేల శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించారని చెప్పారు. వారిని తాను అభినందిస్తున్నానని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande