పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
తెలంగాణ, పెద్దపల్లి. 29 జూన్ (హి.స.) పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఓదెల మండల కేంద్రంలో ఆదివారం వారు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, మరియు 52 మంది కి 19,70,5
పెద్దపల్లి ఎమ్మెల్యే


తెలంగాణ, పెద్దపల్లి. 29 జూన్ (హి.స.) పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఓదెల మండల కేంద్రంలో ఆదివారం వారు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, మరియు 52 మంది కి 19,70,500ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు జిలకుంట గ్రామంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ₹10 లక్షలతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డులను అందజేసినట్లు తెలిపారు. రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే బియ్యంపై పేద కుటుంబాలు ఆధారపడి ఉన్నారన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande