బిఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, బాల్క సుమన్ ల పై కేసు నమోదు
హైదరాబాద్, 29 జూన్ (హి.స.) తెలంగాణ భవన్ వద్ద పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మహా న్యూస్ ఛానల్ పై బీఆర్ఎస్వీ నేతలు దాడి చేసి.. నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అయితే దాడిపై మహా న
పోలీస్ కేసు


హైదరాబాద్, 29 జూన్ (హి.స.)

తెలంగాణ భవన్ వద్ద పోలీసులను

అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మహా న్యూస్ ఛానల్ పై బీఆర్ఎస్వీ నేతలు దాడి చేసి.. నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అయితే దాడిపై మహా న్యూస్ ఛానల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సహా ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున్న బీఆర్ఎస్ భవన్ వద్దకు చేరుకోవడంతో నేతలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, సుమోటోగా తీసుకుని, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చరి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande