హైదరాబాద్, 29 జూన్ (హి.స.)
హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు.అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తోంది. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగానిలిచింది
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్