హైదరాబాద్, 29 జూన్ (హి.స.) హైదరాబాదులోని మధురనగర్ ఆక్రమణలను ఆదివారం హైడ్రా తొలగించింది.స్థానికులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలు కూల్చివేశారు. 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేశారు. అందులో 1533 గజాల స్థలాన్ని పార్కుగా చూపించినట్టు నిర్ధారణ అయింది. లేఔట్లో నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలంలో షెడ్డు వేసి ఖాళీ చేయకుండా ఆక్రమ నిర్మాణం చేశారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలతో కలిసి హైడ్రా పూర్తి స్థాయి విచారణ చేసి.. ఆక్రమణలను తొలగించింది. పార్కు స్థలంగా గుర్తించి ప్రొటెక్టెడ్ బై హైడ్రా అధికారులు బోర్డు పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్