తెలంగాణ, యాదాద్రి. 29 జూన్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని మహిమాన్విత
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నారసింహా స్వామి దేవాలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది.. సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతున్నట్టు సమాచారం. స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు