అమరావతి, 29 జూన్ (హి.స.)
పల్నాడు : విశాఖ ఎక్స్ప్రెస్ (లో దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకుని.. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ