అమరావతి, 29 జూన్ (హి.స.)
అమరావతి: వైకాపా హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని తెదేపా ) అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. తెదేపా, జనసేన, భాజపా ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ