అమరావతి, 29 జూన్ (హి.స.)కొద్ది రోజుల క్రితం పద్మావతి రైలు, చామరాజునగర్ ఎక్స్ప్రైస్ (Chamarajunagar Express)లో ప్రయాణికులను బెదిరించి రూ. 10 లక్షలు లూటీ చేశారు. ఇది మరవక ముందే.. విశాఖ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు దొంగతనానికి ప్రయత్నించారు. అయితే గతంలో జరిగిన దొంగతనాలను దృష్టిలో పెట్టుకున్న రైల్వే సిబ్బంది భద్రతను ఏర్పాటు చేయడంతో.. దొంగతనానికి ప్రయత్నించిన వారిపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో రైలు నుంచి దూకి దొంగలు పారిపోయారు. ఈ ఘటన శనివారం రాత్రి సమయంలో పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర, బీహార్ ఇటీవల కాలంలో పిడుగురాళ్ల దగ్గర వరుసగా చోరీలు చేస్తున్నారు. ఈ గ్యాంగులు వారం రోజుల్లో రెండో ఘటనగా పోలీసులు నిర్ధారించారు. అలాగే పరారీలో ఉన్న ఏడుగురు దొంగల కోసం రైల్వే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి