విశాఖ: 3 జూన్ (హి.స.)ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయుల్లో 4,755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. మిగులుగా తేలిన 4,693 స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేసింది. బదిలీల్లో ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యాయి. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు తుది జాబితా సిద్ధమైంది. పాఠశాలల ఎంపికకు రెండు రోజులపాటు ఐచ్ఛికాలు ఇచ్చి, బదిలీలు పూర్తి చేయనున్నారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విధ్వంసక జీఓ-117 రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి బదిలీల ప్రక్రియ జరుగుతోంది. పదోన్నతులు, బదిలీలను ఈ నెల 10నాటికి పూర్తి చేయనున్నారు. ఈ ఉపాధ్యాయులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే 12వ తేదీ నాటికి కొత్త బడుల్లో చేరిపోయేలా ప్రణాళిక రూపొందించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ