అమరావతి, 3 జూన్ (హి.స.) విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్ప్లాజా వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. వాహనదారులు కేవలం 10 సెకన్లలో టోల్ప్లాజా దాటాల్సి ఉండగా.. కాజా వద్ద మాత్రం ఒక్కోసారి 5 నుంచి 10 నిమిషాలు నిరీక్షించాల్సి వస్తోంది. దీని నిర్వహణలో గుత్తేదారు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కోల్కతా-చెన్నై జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న ఈ టోల్ప్లాజా కీలకమైంది. విజయవాడ, గుంటూరు మధ్య నిత్యం పెద్దసంఖ్యలో రాకపోకలు సాగించే వారంతా ప్లాజా మీదుగానే వెళ్తారు. అటు చెన్నై, ఇటు విశాఖ, కోల్కతా వైపు వెళ్లే సరకు రవాణా వాహనాలు అధికంగానే ప్రయాణిస్తుంటాయి. సగటున నిత్యం లక్ష వరకు వాహనాలు ఈ ప్లాజాను దాటి వెళ్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ