అమరావతి, 3 జూన్ (హి.స.)
: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు.. ఇటీవల పోలీసుల చేతిలో లాఠీదెబ్బలు తిన్న జాన్ విక్టర్ను పరామర్శించనున్నారు.. అయితే, వైఎస్ జగన్.. తెనాలి పర్యటన పాలక-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఉదయం 11.15 గంటలకు తెనాలి ఐతానగర్ చేరుకోనున్నారు వైఎస్ జగన్.. అనంతరం ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్, అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు వైఎస్ జగన్..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ