కాళేశ్వరం.బ్యారేజ్ అవకతవకల పై ఈ నెల 5 న విచారణకు హాజరు కాలేంబని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్‌: 3 జూన్ (హి.స.) , , కాళేశ్వరం బ్యారేజీల్లోని అవకతవకలపై విచారణ చేస్తున్న కమిషన్‌ ఎదుట ఈ నెల 5న హాజరు కాలేనంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమిషన్‌కు విన్నవించారు. మరో తేదీన వస్తానని, గడువు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ను కోరా
కాళేశ్వరం.బ్యారేజ్ అవకతవకల పై ఈ నెల 5 న విచారణకు హాజరు కాలేంబని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్


హైదరాబాద్‌: 3 జూన్ (హి.స.) , , కాళేశ్వరం బ్యారేజీల్లోని అవకతవకలపై విచారణ చేస్తున్న కమిషన్‌ ఎదుట ఈ నెల 5న హాజరు కాలేనంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కమిషన్‌కు విన్నవించారు. మరో తేదీన వస్తానని, గడువు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ను కోరారు. దీంతో కమిషన్‌ సానుకూలంగా స్పందించి... ఈ నెల 11న రావాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ మే 19న మాజీ సీఎం కేసీఆర్, నాటి మంత్రులు ఈటల రాజేందర్‌(ఆర్థిక), తన్నీరు హరీశ్‌రావు(నీటిపారుదల)లకు నోటీసులు పంపింది. 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్‌రావులు హాజరుకావాలని సూచించింది. ఈ క్రమంలో కమిషన్‌ ఎదుట హాజరై తమ బాణీ వినిపించేందుకు కేసీఆర్, హరీశ్‌రావులు సన్నద్ధమయ్యారు. ఒకటికి రెండుసార్లు వారిద్దరూ సమావేశమై విచారణలో వివరించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇంతలో కేసీఆర్‌ విచారణకు మరో తేదీని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande