అమరావతి, 3 జూన్ (హి.స.)
, అమరావతి: గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో అనంతపురం నుంచి అమరావతి వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దానికి కేంద్రం జాతీయ రహదారి సంఖ్యను కూడా కేటాయించింది. తర్వాత వైకాపా ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టింది. దీంతో కేంద్రం ప్రత్యామ్నాయంగా అనంతపురం నుంచి గుంటూరు వరకు 398.8 కి.మీ. పొడవున ఉన్న జాతీయ రహదారి-544డిని విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఇందులో 288.8 కి.మీ.లను నాలుగు వరుసలుగా విస్తరిస్తుండగా.. మధ్యలో 110 కి.మీ.లను మాత్రం రెండు వరుసలుగానే వదిలేశారు. ఇందుకు కొన్ని సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తున్నారు. దాన్ని కూడా నాలుగు వరుసలుగా విస్తరిస్తే రాజధాని నుంచి రాయలసీమకు రాచమార్గం పడినట్లే..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ