అమరావతి, 5 జూన్ (హి.స.)
: ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన భారతీయ విద్యార్థి వియత్నాంలోని కాన్ థో నగరంలో మృతిచెందాడు. మృతుడిని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్గా అక్కడి అధికారులు గుర్తించారు. అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో అర్షిద్ నడిపిన బైకు వేగంగా రావడంతో అది అదుపుతప్పి గోడను ఢీకొట్టింది.
ఈ ప్రమాద సమయంలో అతనితోపాటు ఉన్న అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వేగంగా వెళుతుందని, అదుపుతప్పి నేరుగా గోడను ఢీకొనడంతో ఇద్దరూ పైకి ఎగిరి పడిన దృశ్యాలు దగ్గరలోని సిసిటివీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోలో మొదట ఓ ప్రశ్నతంగా ఉన్న వీధి కనిపిస్తుంది. అలా ఉన్న సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ బైకు గోడను చాలా గట్టిగా గుద్దుతుంది. ఢీకొట్టే వేగం ఎంతగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఢీ కొట్టిన తర్వాత ఇద్దరూ గాల్లోకి ఎగిరిపోతూ కనిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ