హరిహర వీరమల్లు సినిమాపై రాజకీయ రగడ.. వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు
అమరావతి, 5 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసే క్రమంలో హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. కొద్దిరోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదాన్ని కూడా పవన్‌పై విమర్శలు చేసేందుకు
హరిహర వీరమల్లు సినిమాపై రాజకీయ రగడ.. వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు


అమరావతి, 5 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసే క్రమంలో హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. కొద్దిరోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదాన్ని కూడా పవన్‌పై విమర్శలు చేసేందుకు వాడుకుంటున్నారు. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని పవన్ బెదిరిస్తున్నారని.. ఇవి దివాళా రాజకీయాలు కావా అని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన చెప్పుచేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులకు దిగుతున్నారని.. ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా అంటూ విమర్శించారు.

వన్ కల్యాణ్ తనకు ఓటేసిన ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు మరో మాజీమంత్రి అంబటి రాంబాబు. హరిహరవీర మల్లు సినిమా ఐదేళ్లకు పైగా తీశారని.. అది నిర్మాతకు కనకవర్షం కురిపించాలంటూ సెటైర్లు వేశారు.

సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ వెనక్కి ఇచ్చేసిన పవన్

ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు కోసం తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు. 2020లో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా, సుదీర్ఘ కాలం సెట్స్‌పైనే ఉండిపోయింది. పవన్‌కల్యాణ్‌ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్‌పైనే ఉండటంతో నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది. ఈ విషయాలను తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande