ముంబై, 7 జూన్ (హి.స.)వచ్చే వారం ఏజెన్సీ ముందు హాజరు కావాలని బాలీవుడ్ నటుడు డినో మోరియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు రూ.65 కోట్ల విలువైన మిథి నది పూడికతీత కుంభకోణం తో సంబంధం కలిగి ఉన్నాయి.
ఇది మనీలాండరింగ్, ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలను కలిగి ఉంది. ఈ కేసులో డినో మోరియా, అతని సోదరుడు సాంటినో మోరియా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులకు చెందిన అనేక ప్రాంతాల్లో జూన్ 6న ED దాడులు నిర్వహించింది. ఈ దాడులు ముంబై, కొచ్చిలోని వివిధ ప్రదేశాలలో జరిగాయి. ఇవి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నిర్వహించబడ్డాయి. ఈ 2017-2023 మధ్య మిథి నది పూడికతీత కాంట్రాక్టుల్లో అక్రమాలను పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
ఈ అక్రమాల వల్ల BMCకి రూ.65.54 కోట్ల నష్టం వాటిల్లింది. కాంట్రాక్టర్లు, BMC అధికారులు కుమ్మక్కై ఊత పరికరాలు, డ్రెడ్జింగ్ యంత్రాల అద్దెకు సంబంధించిన టెండర్లను కొన్ని నిర్దిష్ట సరఫరాదారులకు అనుకూలంగా మార్చారని, ఊత రవాణా కోసం నకిలీ బిల్లులను సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయి. డినో మోరియా, అతని సోదరుడు సాంటినో మోరియా ఈ కేసులో ప్రధాన ఆరోపితుడైన మధ్యవర్తి కేతన్ కడమ్తో తరచూ ఫోన్ లో మాట్లాడినట్లు ఆధారాలు లిభించాయి. దీంతో మే 26న డినో మోరియాను EOW దాదాపు ఎనిమిది గంటలపాటు ప్రశ్నించింది. ED ఇప్పుడు ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, డినో మోరియా యొక్క ప్రమేయాన్ని మరింత లోతుగా విచారిస్తోంది. ఇందులో భాగంగానే నటుడికి వచ్చేవారం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి