అమరావతి, 8 జూన్ (హి.స.) జేఈఈ అడ్వాన్స్డ్ - 2025 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విజయవాడ నారాయణ కళాశాల విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10, 51, 82, 98 ర్యాంకులు సాధించిన వడ్లమూడి లోకేశ్, భానుచరణ్ రెడ్డి, తోరాటి భరద్వాజ్, జస్వంత్ వెంకట రఘువీర్లను, వారి తల్లిదండ్రులను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ప్రవేశం సాధించడం సామాన్య విషయం కాదని అన్నారు. ఇంతటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మభూమితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి పాటుపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సిధూర నారాయణ, శరణి నారాయణ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి