ఆరు వేలు దాటిన కరోనా కేసులు – 65కి చేరిన మరణాలు
న్యూఢిల్లీ, 8 జూన్ (హి.స.) దేశంలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య ఆరు వేలు దాటింది. ఇప్పటి వరకు కొవిడ్‌తో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.జూన్‌ 8న ఉదయం 8 గంటల వరకు దేశవ
కరోనా


న్యూఢిల్లీ, 8 జూన్ (హి.స.)

దేశంలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య ఆరు వేలు దాటింది. ఇప్పటి వరకు కొవిడ్‌తో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.జూన్‌ 8న ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 6,133లకు చేరింది. గత 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదుకాగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కేరళలో అత్యధికంగా 1950 యాక్టివ్‌ కేసులు ఉండగా.. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, దిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్రాల వారీగా కొవిడ్‌ కేసులు ఇలా..డేటా బోర్డు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కేరళలో అత్యధికంగా 1950 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌ 822, పశ్చిమబెంగాల్ 693, దిల్లీ 686, మహారాష్ట్ర 595, కర్ణాటక 366, ఉత్తరప్రదేశ్‌ 219, తమిళనాడు 194, రాజస్థాన్‌ 132, హరియాణా 102, ఆంధ్రప్రదేశ్‌ 86, బిహార్ 49, ఛత్తీస్‌గఢ్‌ 41, మధ్యప్రదేశ్‌ 39, పంజాబ్‌ 35, ఒడిశా 33, సిక్కిం 23, పుదుచ్చేరి 15, తెలంగాణ 10, జమ్మూ కశ్మీర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో రాష్ట్రంలో 9 చొప్పున కేసులు, అస్సాం 6, ఝార్ఖండ్‌ 4, హిమాచల్‌ ప్రదేశ్‌ 3, చండీగఢ్‌ 2, త్రిపురలో ఒకరు వైరస్‌ బారినపడినట్లు సమాచారం.. అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాంలలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande