హైదరాబాద్, 8 జూన్ (హి.స.)
డోర్నకల్ MLA రామచంద్రు నాయక్ ను డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. పెద్దవంగర మండలంలో జన్మించిన ఆయన 2006లో రాజకీయ అరంగేట్రం చేశారు. TDP అనుబంధ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2006లో పనిచేసి, ఆ తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో డోర్నకల్ TDP అభ్యర్థిగా, 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2023లో MLAగా ఎన్నికైన ఆయన నేడు ప్రకటించిన మంత్రి వర్గ విస్తరణలో డిప్యూటీ స్పీకర్ పదవి కి ఎంపికయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్