రెండు చక్రాలు...ఒకే లక్ష్యం
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో “సండేస్ ఆన్ సైకిల్” కార్యక్రమాన్ని జీఎం శ్రీ అరుణ్ కుమార్ జైన్ ప్రారంభించారు.
రెండు చక్రాలు...ఒకే లక్ష్యం


హైదరాబాద్, 8 జూన్ (హి.స.)

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన నిర్వహణాధికారి శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ఈరోజు అనగా (8 జూన్ 2025) రోజున సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన “ఫిట్ ఇండియా సైక్లోథాన్” కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సైకిల్ యాత్రలో తానే స్వయంగా ఇతర రైల్వే అధికారులు, క్రీడాకారులతో కలిసి సైక్లింగ్‌లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఎస్ .సి. ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా స్కీమ్ – ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నిర్వహించారు. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో, ఆరోగ్యాన్ని మన దైనందిన జీవితంలో భాగంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. రైల్వే ఉద్యోగులకు ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, ఈ దక్షిణ మధ్య స రైల్వేలో ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రైల్వే క్రీడా సంఘాన్ని అభినందించారు. “ఆరోగ్యంగా ఉండటం ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించిందనీ పేర్కొన్నారు .సైక్లింగ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు .విదేశాల్లో ఇప్పుడు మళ్లీ చాలా మంది ఫిట్‌నెస్ కోసం సైక్లింగ్‌కు మళ్లుతున్నారనీ తెలిపారు .దీనివల్ల పర్యావరణ హితమైనదే కాకుండా శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది,” అని ఆయన పేర్కొన్నారు. ప్రతి రైల్వే ఉద్యోగి ఈ ఉద్యమంలో చురుకుగా భాగస్వామి కావాలని జీఎం పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు

ప్రధాన నిర్వహణాధికారి

శ్రీ.నీరజ్ అగర్వాల్ , డీఆర్‌ఎం శ్రీ భర్తేష్ కుమార్ జైన్ (సికింద్రాబాద్ డివిజన్), ఇతర సీనియర్ రైల్వే అధికారులు, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైల్వే క్రీడాకారులు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారి తీసేలా, మన ప్ర‌ధాన‌మంత్రి గారి విజన్ ఆధ్వ‌ర్యంలో రూపొందిన ఫిట్ ఇండియా ఉద్య‌మంలో భాగంగా “సండేస్ ఆన్ సైకిల్” అనే థీమాటిక్ క్యాంపెయిన్ ప్రారంభించబడింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖతో పాటు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం జరిగే ఈ సైక్లింగ్ క్యాంపెయిన్‌తో ఫిట్‌నెస్ పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది.

--

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande