హైదరాబాద్, 8 జూన్ (హి.స.) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలను మధ్యాహ్నం ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు. గోపీనాథ్ అంతిమ సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు గాల్లోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు నేతలు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు అంతిమయాత్రలో పాడెను మోశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్