హైదరాబాద్, 8 జూన్ (హి.స.)
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని కళా నిలయంలో ఆదివారం కృష్ణ ప్రసాద్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశ కార్యక్రమంలో 2024 యూపీఎస్సీ ర్యాంకర్స్ 13మందికి హాజరైన ముఖ్య అతిథులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా అన్ లిమిటెడ్ యుపిఎస్సి ఉత్సవ్ బ్రోచర్ ను ముఖ్య అతిథులుగా హాజరైన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర అడిషనల్ డీజీపీ యం.మహేష్ భగవత్, ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ కలిసి ఆవిష్కరించారు.
అనంతరం మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ భారతదేశం సంస్కృతికంగా వైవిద్య భరిత మైన దేశం, సివిల్ సర్వెంట్లు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన వెన్నుముకవలె ఉండాలన్నారు. ఈ వ్యవస్థను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను అనుసరించేలా నిర్మించాలని అన్నారు.
ఏ దేశం కూడా తమ స్వాతంత్రానికి భంగం కలిగే విధంగా కృతజ్ఞత చూపదనిపేర్కొన్నారు.యువత డిగ్నిటీని కాపాడుకొని ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్