హైదరాబాద్, 8 జూన్ (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక
పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.. మరికొన్ని గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు.. రేపు సిట్ అధికారుల ఎదుట ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నాడు.. ట్రావెల్ పర్మిట్ కు సంబంధించిన పత్రాలు ప్రభాకర్ రావుకు అందిన మూడు రోజుల్లోగా విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. అమెరికాలో ట్రావెల్ కు సంబంధించిన పత్రాలు రెండు రోజుల క్రితం ప్రభాకర్ రావు అందుకోవడం జరిగింది ..పత్రాలు తీసుకున్న తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో విమానం ఎక్కాడు.. ఆ తర్వాత ఇవాళ రాత్రికి హైదరాబాదులో దిగిపోతున్నాడు .
రేపు సిట్ ఎదుట హాజరు కాపుతున్నట్లు ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చాడు.. అయితే పోలీసుల ఎదుట హాజరై ప్రభాకర్ ఏమి చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది..
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్