సూర్యాపేట, 8 జూన్ (హి.స.)
టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ
కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఆర్ధరాత్రి స్థానిక ఫాతీమా పాఠశాల సమీపంలో టాటా ఏస్ వాహనాన్ని లారీ వెనుక నుండి ఢీ కోట్టడంతో మండల పరిధిలోని కోక్యానాయక్ తండ గ్రామ పంచాయతీకి చెందిన గుగులోతు భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహన్ని తుంగతుర్తి ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. భాస్కర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..