తెలంగాణ, మహబూబాబాద్. 8 జూన్ (హి.స.)
సైకిల్ పై వెళ్తుండగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొని జాటోత్ హిందూ అనే అమ్మాయి (12) మృతి చెందింది. ఈ ఘటన పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామ సమీపంలోని కిష్టు తండా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాటోత్ హిందూ సైకిల్ పై వెళ్తుండగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొని తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు