విజయవాడ, 8 జూన్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విజయవాడలో సందడి చేశారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొనికి అనే సెలూన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, యార్లగడ్డ వెంకట్రావు ఇరువురూ సెలూన్ నిర్వాహకులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ లేత నీలం రంగు రౌండ్ నెక్ టీషర్ట్, నలుపు రంగు షార్ట్స్ ధరించి వచ్చారు. ఆయన క్యాజువల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది, ట్రెండీగా కనిపించిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి