విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది
అమరావతి, 9 జూన్ (హి.స.), విహారయాత్రలో విషాదం చోటుచేసుకొంది. హిమాలయ పర్వతారోహణ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన విజయవాడ నగరానికి చెందిన ఆర్కిటెక్ట్‌ ఇంజినీరు అడుసుమల్లి లక్ష్మణరావు (65) మృతి చెందారు. ఈయనతోపాటు పోరంకి, పెనమలూరు, విజయవాడ నగరానికి చెందిన ప
విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది


అమరావతి, 9 జూన్ (హి.స.), విహారయాత్రలో విషాదం చోటుచేసుకొంది. హిమాలయ పర్వతారోహణ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన విజయవాడ నగరానికి చెందిన ఆర్కిటెక్ట్‌ ఇంజినీరు అడుసుమల్లి లక్ష్మణరావు (65) మృతి చెందారు. ఈయనతోపాటు పోరంకి, పెనమలూరు, విజయవాడ నగరానికి చెందిన పలువురు బృందంగా వారం కిందట హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఫ్రెండ్‌షిప్‌ పీక్‌ అనే ప్రాంతంలో శనివారం వీరు పర్వతారోహణ చేస్తుండగా ఉన్నట్లుండి లక్ష్మణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇతడిని గైడ్‌లు చికిత్స నిమిత్తం తిరిగి కిందకు తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. లక్ష్మణరావు మృతదేహం సోమవారం ఉదయం విజయవాడలోని స్వగృహానికి చేరుకోనుంది. మృతదేహాన్ని విమానంలో విజయవాడ తరలించడానికి పర్వతారోహణకు వెళ్లిన తెదేపా నాయకుడు అనుమోలు ప్రభాకరరావు తదితరులు మనాలిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande