నెల్లూరు, 9 జూన్ (హి.స.) మొదటి రోజు 22 ప్రశ్నలు అడిగినా ఎలాంటి సమాధానం రాలేదు.. రెండోరోజు 35 ప్రశ్నలు సంధించగా నోరు మెదపలేదు.. మూడోరోజు అయిదారు ప్రశ్నలు వేశారు.. వాటికీ సమాధానం లేదు. ఇదీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మూడు రోజుల పోలీసు కస్టడీ తీరు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న ఆయన్ని మూడు రోజుల పోలీసుల కస్టడీకి న్యాయస్థానం ఇవ్వగా ఆదివారం ముగిసింది. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి పోలీసులు కృష్ణపట్నం పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. మూడురోజుల పాటు అక్కడే ఉంచి విచారణ చేశారు. ఆధారాలు, వాంగ్మూలాలు, అక్రమ మైనింగ్కు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులు సేకరించి కాకాణి ముందుంచి ప్రశ్నించగా ఒక్కదానికీ సమాధానం చెప్పలేదు. ఏ సమాచారమూ పోలీసులు రాబట్టలేకపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ