లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
ముంబయి - , 9 జూన్ (హి.స.)దేశీయ మార్కెట్ సూచీలు (Stock Market) సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, అంచనాలకు మించి అరశాతం మేర కీలక రేట్లను తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)లో కోత విధిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆ
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు


ముంబయి - , 9 జూన్ (హి.స.)దేశీయ మార్కెట్ సూచీలు (Stock Market) సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, అంచనాలకు మించి అరశాతం మేర కీలక రేట్లను తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)లో కోత విధిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయాలతో మార్కెట్లో సానుకూలత కనిపిస్తోంది.

ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 280 పాయింట్లు పుంజుకొని 82,469 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు ఎగబాకి 25,091 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.60గా ఉంది. నిఫ్టీ సూచీలో కొటక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, టాటామోటార్స్‌, యాక్సిక్ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, ఎటర్నల్‌, హెడ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్స్ నష్టాల్లో రోజును మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande