ఐఈడీ పేల్చిన మావోయిస్టులు.. అదనపు ఎస్పీ మృతి
చర్ల: 9 జూన్ (హి.స.)ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. దోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్‌ రావు గిరిపుంజే మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు
ఐఈడీ పేల్చిన మావోయిస్టులు.. అదనపు ఎస్పీ మృతి


చర్ల: 9 జూన్ (హి.స.)ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. దోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్‌ రావు గిరిపుంజే మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న అదనపు బలగాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

జూన్‌ 10వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆదివారం మావోలు చిక్వార్‌ గూడ వద్ద పొక్లెయిన్‌ను దహనం చేశారు. దీంతో ఆ ప్రదేశానికి వెళ్లేందుకు.. కాంటా-ఎరబోరా మార్గంలో ఏఎస్పీ ఆకాశ్‌రావ్‌, మిగిలిన సిబ్బందితో కలిసి ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ప్రెజర్‌ ఐఈడీని పేల్చారు. దీంతో ఏఎస్పీ తీవ్రంగా గాయపడటంతో.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. గాయపడిన వారికి కొంటా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande