విమాన ప్రమాద ఘటన దర్యాప్తు ఇంకా ముగియలేదు..ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్
ముంబై, 14 జూలై (హి.స.) ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య లేవ‌ని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఇంజిన్‌లో గానీ.. స్విచ్‌ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు. బోయింగ్ విమానం పూర్తిగా సేఫ్‌గా ఉందని తె
ఎయిరిండియా సీఈవో


ముంబై, 14 జూలై (హి.స.)

ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య లేవ‌ని ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఇంజిన్‌లో గానీ.. స్విచ్‌ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు. బోయింగ్ విమానం పూర్తిగా సేఫ్‌గా ఉందని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదికపై ఆయ‌న స్పందిస్తూ ఒక ప్ర‌క‌ట‌న‌ను నేడు విడుద‌ల చేశారు. ఇంధన స్విచ్‌లపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమ‌ని తేల్చారు.ఆ స్విచ్‌లను ఎయిరిండియా రెండుసార్లు మార్చినట్లుగా పేర్కొన్నారు. ఇక ఇంధన స్విచ్‌లు పూర్తిగా సురక్షితమని అమెరికా కు చెందిన సంస్థ కూడా తేల్చింద‌ని గుర్తు చేశారు. అయితే విమానం టేకాప్ అయిన తర్వాత రెండు స్విచ్‌లు ఎందుకు ఆపి ఉన్నాయన్న దానిపై దర్యాప్తు జరుగుతోంద‌న్నారు.ఇక విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లే ముందు ఇద్దరు పైలట్లకు శ్వాస పరీక్షలు నిర్వహించామ‌ని చెప్పారు. కాగా, విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న బృందంలో విల్సన్ కూడా ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande